నాగర్ కర్నూల్: ఆధ్యాత్మిక వేత్త చిన్నజీయర్ స్వామి ఇవాళ కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం బైరాపర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా ప్రతిష్టాపన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణ, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.