మహబూబ్నగర్: మంత్రి లక్ష్మారెడ్డి ఇవాళ జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముస్లిం సోదరులు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేకు ఖీర్తో విందిచ్చారు.