మహువా: రాష్ట్రీయ జనతాదళ్ నేత, బీహార్ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఓ దళితుడి ఇంట్లో స్నానం చేశారు. మహువాలోని కరహటియా పంచాయతీ ప్రాంతంలో ఉన్న ఓ దళితుడి ఇంటికి సోమవారం తాజ్ ప్రతాప్ వెళ్లారు. దళితుడి ఇంట్లో స్నానం చేసిన ఫోటోలను తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. హ్యాండ్పంప్ కొట్టుకుని స్నానం చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అయ్యింది. తాజ్ చేసిన ట్వీట్లను మాజీ డిప్యూటీ సీఎం, అన్న తేజస్వి యాదవ్ రీట్వీట్ చేశారు. దీంతో అన్నాదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. ఇటీవల పాట్నాలో జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో తేజస్వి యాదవ్కు మకుటాన్ని ధరించారు. ఆ ఘటన పట్ల తేజ్ ప్రతాప్ నిరుత్సాహంగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అన్నాదమ్ముళ్ల మధ్య జగడం మొదలైందన్నారు. కానీ తమ మధ్య భేదాభిప్రాయలు ఏమీ లేవని తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు.