నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో భారతీయ చారిత్రక దస్ర్తాల ప్రదర్శన 62వ జాతీయ సదస్సును డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సదస్సులో వివిధ రాష్ర్టాల ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మారుతున్న సమాజానికి అనుగుణంగా దస్ర్తాలను మార్చుకోవాలని సూచించారు. పురాతన దస్ర్తాలను డిజిటలైజేషన్ చేసుకోవాలని చెప్పారు. చరిత్రను కాపాడుకుని.. దస్ర్తాలను భద్రపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం. పూర్వీకులు అందించిన సంపదను భావితరాలకు అందించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్కియాలజీ.. 50 మిలియన్ల హిస్టారికల్ డాక్యుమెంట్స్ కలిగి ఉండటం చాలా సంతోషమని కడియం చెప్పారు. ఏడాది లోపు తెలంగాణ ఆర్కియాలజీని డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. భవిష్యత్ తరాల కోసం రికార్డులు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కడియం శ్రీహరి చెప్పారు.