ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వరద నీరు అధికంగా రావడంతో.. భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుంది. ఇవాళ భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 26.3 అడుగులకు చేరింది. గోదావరిలోకి ప్రజలు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆ నీరు కూడా గోదావరిలో కలిసిపోతుంది. దీంతో గోదావరికి వరద ప్రవాహం ఎక్కువైందని అధికారులు చెబుతున్నారు.