రాంచీ: నక్సల్స్ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ మృతిచెందాడు. ఈ ఘటన జార్ఖండ్లోని తూర్పు సింగ్బూం జిల్లాలో గల అటవీ ప్రాంతంలో నేడు చోటుచేసుకుంది. సీఆర్పీఎఫ్ 193వ బెటాలియన్కు చెందిన జవాను చనిపోయాడు. పారామిలటరీకి చెందిన కానిస్టేబుల్ ర్యాంక్ జవాన్ బుల్లెట్ గాయాలతో బయటపడ్డాడు. నక్సల్స్ ఆచూకీ కోసం రాష్ట్ర పోలీసు టీం, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ ఉదయం 9 గంటలకు ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.