పరిపూర్ణానందస్వామి నగర బహిష్కరణను వ్యతిరేకిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ స్వామి బహిష్కరణ ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. హిందూ దేవతలను దూషించిన ఎంఐఎం నాయకులను ఎందుకు బహిష్కరించడం లేదని ప్రశ్నించారు. పరిపూర్ణానందను బహిష్కరించడం అంటే హిందువులను బహిష్కరించడమే అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.