వరంగల్: మంత్రి కడియం శ్రీహరి ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం 11 గంటలకు వరంగల్ రూరల్ కలెక్టర్ కార్యాలయంలో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల విద్యాశాఖపై మంత్రి కడియం సమీక్షించనున్నారు. విద్యాశాఖకు సంబంధించిన వివిధ అంశాల మీద సంబంధిత అధికారులతో కడియం రివ్యూ చేయనున్నారు. ఈ సమావేశం అనంతరం భద్రకాళీ ఫైర్ వర్క్స్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 10 మంది కుటుంబ సభ్యులకు 5 లక్షల ఎక్స్గ్రేషియాను మంత్రి అందించనున్నారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఇల్లు కోల్పోయిన 14 కుటుంబాలకు, 10 మంది మృతుల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ప్రొసీడింగ్లను మంత్రి అందజేస్తారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా మృతుల కుటుంబ సభ్యులకు 20 వేల నగదుతో పాటు ఒక బస్తా బియ్యం, ఇతర నిత్యవసర సరుకులను మంత్రి ఇవ్వనున్నారు.