వరంగల్: అమెరికాలో దుండగుల కాల్పుల్లో చనిపోయిన కొప్పు శరత్ భౌతిక కాయానికి ఇవాళ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాళి అర్పించారు. వరంగల్లో కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన.. ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అమెరికాలో వరంగల్కు చెందిన విద్యార్థి శరత్ కొప్పుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్రగాయాలైన శరత్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. మిస్సోరిలోని కేన్సస్సిటీ రెస్టారెంట్లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల సమయంలో శరత్తో పాటు మరికొంత మంది స్నేహితులు కూడా ఉన్నారు. స్నేహితుల ద్వారా విషయం తెలిసినట్టు శరత్ మామయ్య సదాశివుడు తెలిపారు. సదాశివుడు ఇచ్చిన సమాచారం ప్రకారం..ఆరు నెలల కిత్రమే అమెరికాలో ఎంఎస్ చేసేందుకు శరత్ వెళ్లాడు. శుక్రవారం శరత్ తన స్నేహితులతో పాటు కలిసి రెస్టారెంట్కు వెళ్లిన సమయంలో కొందరు నల్లజాతీయులు వచ్చి గన్తో వీరిని బెదిరించారు. భయంతో పరుగెత్తేందుకు ప్రయత్నించగా, జరిపిన కాల్పుల్లో శరత్ భుజంలోకి బుల్లెట్ దిగినట్టు స్నేహితుల ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందింది. శరత్ పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు తెలిపారు.