హైదరాబాద్ : రైతుల పొలాల్లో పండ్ల తోటలు పచ్చదనంతో పాటు వారికి లాభాలు ఆర్జించి పెట్టవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా రైతులకు లాభాలు ఆర్జించి పెట్టే ఉద్యనవనాలు, ఇతర తోటలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయించింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద వీటికి నిధులు సమకూర్చుతున్నారు. పేద రైతుల భూముల్లో పండ్ల తోటల పెంపకం కార్యక్రమంలో భాగంగా మామిడి, బత్తాయి, జామ, దానిమ్మ, సీతాఫలం, అంజూర, నేరేడు, సపోట, నిమ్మ, చింత, ఆపిల్బేర్ వంటి పదకొండు రకాల తోటలను పెంచుతున్నారు. పొలం గట్ల వెంబడి టేకు, మలబారు, యూకలిప్టస్, మల్బరీ, సుబాబుల్ తోటలు కూడా పెంచనున్నారు.