హన్మకొండ : వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల విద్యా శాఖపై వరంగల్ రూరల్ కలెక్టర్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి సమీక్ష ప్రారంభించారు. ప్రతి పాఠశాలలో చదువుకునే వాతావరణం కల్పించాలని. ప్రతి పాఠశాలలో పనిచేసే టాయిలెట్స్ ఉండాలని, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, కనీస వసతులు, అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడలు ఉండాలని, పాఠశాలల కు కలర్స్ వేయాలని డిప్యూటీ సీఎం కడియం సమీక్షలో తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీల నేపథ్యంలో వెంటనే ఖాళీలు గుర్తించి విద్యా వలంటీర్లను నియమించుకోవాలని సూచించారు.