నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 23 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 698 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 700.6 అడుగులు. కడెం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి అధికమవడంతో.. ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి.. దిగువకు 23 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.