భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా రేపు తెలంగాణకు రానున్నారు. రేపు ఉదయం అమిత్షా బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. ఎయిర్పోర్టులో అమిత్షా కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించనున్నారు. విశిష్ఠ సంపర్క్ అభియాన్లో భాగంగా అమిత్షా పలువురు ప్రముఖులను కలవనున్నారు. ఆర్ఎస్ఎస్ ముఖ్యులతో ఆయన సమావేశం కానున్నారు. అలాగే బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ, పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు.