పెద్దపల్లి: జిల్లాలోని మేడారంలో మంత్రి హరీశ్రావు పర్యటిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీ పనులను మంత్రి పరిశీలించారు. అర్థరాత్రి వరకు ఏడో ప్యాకేజీ పనులపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాత్రి మేడారం చేరుకున్న మంత్రి అక్కడే బస చేసి ఉదయం పనులపై సమీక్ష జరిపారు. ఆరోప్యాకేజీలోని సర్జుపూల్ పనులను పరిశీలించిన మంత్రి ఆగస్టు 15 కల్లా నీటిని నింపడానికి సర్జుపూల్ని సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి వెంట ఓఎస్డి శ్రీధర్ దేశ్ పాండే, ప్రాజెక్టు సీఈ నల్లా వెంకటేశ్వర్లు, ఎస్ ఈ పాక వెంకట రాములు, ఈఈ నూనె శ్రీధర్ తదితరులు ఉన్నారు.