గువాహటి : ప్రముఖ గాయని కల్పనా పటొవరి బీజేపీలో చేరారు. పాట్నాలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా సమక్షంలో కల్పనా బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ నాయకత్వం, విజన్ వల్ల తనకు రాజకీయాలపై ఆసక్తి పెరిగిందని కల్పనా అన్నారు. బీజేపీ సిద్దాంతాలు, అధికారం, రాజకీయాలతో ప్రజలకు చేరువై సేవ చేస్తానని చెప్పారు. ఎన్నికల్లో పోటీచేసేందుకు తాను బీజేపీలో చేరలేదని, కానీ పార్టీకి తనవంతు సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని కల్పనా పటొవరీ స్పష్టం చేశారు. అసోంకు చెందిన కల్పనా పటొవరీ భోజ్పురి క్వీన్ అని పేరుంది. కల్పనా హిందీ, తమిళం, బెంగాలి, మరాఠి, అస్సామి భాషల్లో హిట్ పాటలను పాడారు. ఈ కార్యక్రమంలో బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ, పలువురు బీజేపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.