ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 20 నుంచి లారీ యజమానుల సమ్మె

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 14, 2018, 04:03 PM

హైదరాబాద్‌: లారీ యజమానులను కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. డీజిల్ ధరలను కేంద్రం మూడు నెలలకోసారి సమీక్షించాలని కోరారు. అలాగే రోడ్ సేఫ్టీ బిల్లును సవరించాలని శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్ చేశారు. ఈ నెల 20 నుంచి లారీ యజమానులు సమ్మె చేపట్టనున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని కోరారు. సింగిల్ పర్మిట్ విధానంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్చించాలన్నారు. సమ్మె విరమణ సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని భాస్కర్‌రెడ్డి ఆరోపించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com