లార్డ్స్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి వన్డేలో గెలిచిన భారత్ 1-0తో ముందంజలో ఉండగా, ఈ వన్డేను గెలవడం ద్వారా సిరీస్లో నిలవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. తొలి వన్డేలో చేసిన పొరపాట్లకు తావివ్వకుండా కుదురుగా ఆడాలని నిర్ణయించినట్టు మోర్గాన్ తెలిపాడు. భారీ స్కోరు సాధించి ప్రత్యర్థికి సవాలు విసరనున్నట్టు చెప్పాడు. టీమిండియా సారథి కోహ్లీ మాట్లాడుతూ తాను టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలని అనుకున్నానని, ఇప్పుడు అదే దక్కినందుకు సంతోషంగా ఉందన్నాడు. లార్డ్స్ మైదానం ఎప్పుడూ సీమర్లకు అనుకూలిస్తుందని పేర్కొన్నాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నాడు.