ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన మంత్రి జోగురామన్న

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 15, 2018, 12:48 PM

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో స్వచ్చ పక్వాడా దినోత్సవం సందర్భంగా స్వచ్ఛతపై మంత్రి జోగురామన్న విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జోగురామన్న మాట్లాడుతూ..స్వచ్ఛ భారత్ -స్వచ్ఛ తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలన్నారు. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకువచ్చినా.. ప్రజల భాగస్వామ్యం లేనిదే విజయం సాధించలేమని, అందుకే ప్రభుత్వం ప్రజలు కలిసి శ్రమిస్తేనే పథకాల లక్ష్యాలు నెరవేరుతాయన్నారు.  స్వచ్ఛమైన గాలి అనుకూలించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జోగురామన్న కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com