కామారెడ్డి : నస్రుల్లాబాద్ మండలం బొప్పాపల్లి శివారులో చిరుత సంచారం చేస్తుంది. చిరుతను గమనించిన వేటగాళ్లు.. బొప్పాపల్లి శివారు ప్రాంతంలో ఇనుప ఉచ్చును అమర్చారు. దీంతో ఆ ఇనుప ఉచ్చులో చిరుత చిక్కుకుంది. అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. స్థానికులకు చిరుత వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఇనుప ఉచ్చును అమర్చినట్లు వేటగాళ్లు తెలిపారు.