హైదరాబాద్: నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి తలసాని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ కళ్యాణోత్సవానికి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బోనాలతో వచ్చే మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు.