ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్లమ్మ కళ్యాణోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తాం: మంత్రి తలసాని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 16, 2018, 02:01 PM

హైదరాబాద్‌:  నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి తలసాని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ కళ్యాణోత్సవానికి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బోనాలతో వచ్చే మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com