చెన్నై: తమిళనాడులోని ఎస్పీకే సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహించారు. తమిళనాడు వ్యాప్తంగా 30 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రూ.160 కోట్లు, 100 కిలోల బంగారం, స్వర్ణాభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 30 బ్యాంకు ఖాతాల వివరాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రహదారుల నిర్మాణ పనులు కాంట్రాక్ట్ పనులను ఎస్పీకే సంస్థ చేపడుతోంది. విరుదనగర్ జిల్లా అరుప్పుకొట్టె, చెన్నైలో ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని సంస్థ నిర్వహకులు, బంధువుల నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్, క్రోంపేట, ఔసెంట్నగర్, అభిరామాపురంతో సహా 30 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఎస్పీకే సంస్థతో వ్యాపార సంబంధాలు ఉన్న టీవీహెచ్ కన్స్ట్రక్షన్ అధినేత రవిచంద్రన్ నివాసంలోను తనిఖీలు చేస్తున్నారు.