నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలం కొట్టాలగడ్డ గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన వెళుతున్న గొర్రెలపై నుంచి లారీ దూసుకెళ్లడంతో 20 గొర్రెలు మృతి చెందాయి. మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. సుమారు రూ. 3 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.