బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, పండుగకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలి పారు. సాలార్జంగ్ మ్యూ జియంలో వివిధ ప్రభుత్వ విభాగాలు, ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ.... బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ఆలయాల వద్ద మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా షీ టీం సభ్యులు బందోబస్తులో ఉంటారని తెలిపారు.
పాతనగరంలోని ప్రధాన దేవాలయాలైన లాల్దర్వాజా సింహవాహినీ అమ్మవారిదేవాలయం, అక్కన్న మాదన్న దేవాలయం, ఉప్పుగూడ, గౌలిపుర అమ్మవారి దేవాలయాల వద్ద మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా పోలీసులు, షీ టీం సభ్యులు బందోబస్తులో ఉంటారని తెలిపారు. ఉత్సవాల్లో డీజేలను ఉపయోగించవద్దని తెలిపారు. బోనాల అనంతరం నిర్వహించే ఘటాల ఊరేగింపు సమయంలోనూ ఆలయాల కమిటీ సభ్యులు నిర్ధారిత సమయంలోగా పోతరాజు కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలన్నారు. రంగం, భవిష్యవాణి కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలన్నారు. ఊరేగింపు మార్గంలో పోలీసులతోపాటు కమ్యూనిటీ సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందన్నారు.
ప్రధాన దేవాలయాల వద్ద అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని జోనల్ కమిషనర్ రవి కిరణ్ తెలిపారు. ప్రధాన రహదారులతోపాటు అంతర్గత దేవాలయాల వద్ద అమ్మవార్లకు బోనాలను సమర్పించడానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం షాబాద్ బండలతోపాటు బీటీ రోడ్లు వేస్తున్నామని తెలిపారు. బోనాల రోజు మంచినీటి ని సరఫరా చేస్తామని జలమండలి మేనేజర్ ఖాదర్ మోహినుద్దీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మం డల డీసీపీ సత్యనారాయణ, ట్రాఫిక్ డీసీపీ బాబూరావు, అదనపు డీసీపీ గౌస్ మోహినుద్దీన్, చార్మినార్ ఏసీపీ అంజయ్య, పలువురు ఇన్స్పెక్టర్లు, ఉమ్మడి దేవాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు.a