హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తీరుపై ఉమ్మడి హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో అధ్యయనాల కోసం తమకు గడువు కావాలంటూ మండలి పేర్కొనడాన్ని తప్పుబట్టింది. బొల్లారంలోని తమ లేబరేటరీస్ యూనిట్ విస్తరణకు 2015లో పెట్టుకున్న దరఖాస్తుపై కేంద్ర పర్యావరణశాఖ స్పందించకపోవడాన్ని సవాల్చేస్తూ ఉమ్మడి హైకోర్టులో డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీ హైకోర్టును ఆశ్రయించింది. పటాన్చెరు, బొల్లారంతోపాటు ఇతర కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిస్థాయి అధ్యయనం వివరాలను, డాక్టర్ రెడ్డిస్ లాబరేటరీ దరఖాస్తుపై నిర్ణయాన్ని శుక్రవారంలోగా తెలియజేయాలని కేంద్ర పీసీబీకి ఆదేశాలు జారీచేసింది.