అర్జున్ రెడ్డితో టాక్ ఆఫ్ ద టాలీవుడ్గా మారిన విజయ్ దేవరకొండ.. ఆ సినిమా తర్వాత కూడా తన క్రేజ్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇటీవల తనకు వచ్చిన ఫిలింఫేర్ అవార్డును అమ్మేసి, వచ్చిన సొమ్మును తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే విజయ్ దేవరకొండ ఆ అవార్డును అమ్మకానికి పెట్టగా 25 లక్షలు వచ్చాయి.తాజాగా అవార్డు అమ్మగా వచ్చిన 25 లక్షలను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చేందుకు విజయ్ దేవరకొండ మంత్రి కేటీఆర్ను కలిశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి విజయ్ దేవరకొండ ఈ 25 లక్షల చెక్ను అందచేశారు. అనంతరం కేటీఆర్తో విజయ్ సుదీర్ఘ చర్చలు జరిపారు.