డిండి ప్రాజెక్టు నుంచి మంత్రి జగదీశ్రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... డిండి ప్రాజెక్టు రైతులు సంతోషంగా ఉన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సీఎం కేసీఆర్ కల్వకూర్తి ఎత్తిపోతల పథకం ద్వారా డిండిని నింపి సాగునీటిని విడుదల చేశారు. ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకొని తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. దేవరకొండ ప్రాంతం సమైక్య పాలనలో అధోగతి పాలైంది. కన్న బిడ్డలను అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితులు వచ్చాయి. తెలంగాణ వచ్చాక దేవరకొండను బంగారు కొండగా మరుస్తున్నాం. ఫ్లోరైడ్ నిర్ములన ప్రాజక్టైన డిండి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్లను పనులు యుద్ధప్రతిపాదికన జరుగుతున్నాయి. నల్లగొండ అధోగతిపాలు కావడానికి కాంగ్రెస్ పార్టే కారణం. జిల్లా నుంచి కాంగ్రెస్ను ప్రజలు తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.