న్యూఢిల్లి : ప్రధాని నరేంద్ర మోడీపై అవిశ్వాస తీర్మానం పెట్టిన వాళ్లే మోడీని కౌగలించుకున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అదే పని తాను చేసి ఉంటే తనమీద ఫత్వా జారీ అయి ఉండేదని ఆయన చెప్పారు. మోడీని విమర్శించిన తరువాత రాహుల్ గాంధీ ఆయనను కౌగలించుకున్నారని, దీనిపై కాంగ్రెస్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఒవైసీ అన్నారు.