నిజామాబాద్ జిల్లా పోచంపాడ్లో రైతులు ఆందోళనకు దిగారు. శ్రీరాంసాగర్ నుంచి పంటకు నీరందించాలని కోరుతూ వారు ఆందోళనకు దిగారు. ప్రస్తుత పరిస్థితిలో నీరివ్వకపోతే తమ పంటలు ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉందని, ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి నీరు చేరితో విడుదల చేస్తామని, ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కాగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకితీయ కాలువకు నీరు విడుదల చేయాలని గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.