బెంగళూరు : లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కౌగలించుకున్న అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. తాజాగా కర్ణాటక జెడిఎస్ అధ్యక్షుడు హెచ్ విశ్వనాథన్ ఈ ఘటనపై వ్యాఖ్యానించారు. రాహుల్ది చిన్న పిల్లల చేష్టగా విశ్వనాథ్ అభివర్ణించారు.