పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప గుడి చౌరస్తా వద్ద రాజీవ్రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. అర్ధరాత్రి సమయంలో ఆవులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు ఉదయం స్థానికులు గుర్తించారు. వీటి విలువ సుమారు లక్షా 50వేల వరకు ఉంటుందని యజమాని వాపోయాడు. ఆవులను రోడ్లపై వదిలేయడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చర్చించుకున్నారు. సంఘటన స్థలం వద్ద పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు.