రంగారెడ్డి : బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ కళాశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థుల ఫీజుల బకాయిలు రూ.2200 కోట్లు చెల్లించి వారి స్కాలర్ షిప్ ను రూ.500 నుంచి రూ.2000 వరకూ పెంచాలని, అలాగే తాండూర్ హాస్టల్ విద్యార్థులకు సొంత భవనాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.