భద్రాద్రి కొత్తగూడెం: బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాద జరిగింది. అదుపుతప్పిన బస్సు వాగుపైనుంచి బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు బస్సులోని ప్రయాణికులను బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెండు 108 వాహనాల సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.