ఖమ్మం-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకూ 1766.08 మిమీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని నేలకొండపల్లి మండలంలో 253.8 మిమీ, ముదిగొండ మండలం 226.4 మిమీ, ఖమ్మం అర్బన్ మండలంలో 128.2మిమీ, బోనకల్లు మండలంలో 109.4మిమీ,సత్తుపల్లి 76.8మిమీ వర్షం పడినట్లు అధికారులు తెలిపారు. మిగతా మండలాల్లో కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, మణుగూరు, కొత్తగూడెం మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మణుగూరు మండలంలోని కోడిపుంజుల వాగు ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. గోదావరిలో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మత్య్సకారులు రాయగూడెం ప్రాంతంలో నదిలో చిక్కుకున్నారు. జిల్లాల్లో మిగతా మండలాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.