రంగారెడ్డి : ప్రభుత్వ పథకాల సాఫల్యం కోసం ప్రతీ ఒక్కరూ సహకరించాలని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి మహేందర్ రెడ్డి ఇంటింటికి అంగన్ వాడీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తల్లీబిడ్డల సంరక్షణ,సంక్షేమ పథకాల వివరాల కోసం ప్రతీ ఇంటిలో వివరాలు మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ నమోదు చేయాలన్నారు. జిల్లాలోని 1600 అంగన్ వాడీ కేంద్రాల పరిధిలో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్ జిల్లా లోని ప్రతీ ఇంటికి వెళ్ళి వివరాలు నమోదు చేస్తారన్నారు. రోజు కనీసం ఒక్క ఇల్లయినా నమోదు చేయాలన్నారు.