శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులో 2,300 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లో వస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 1062.70 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 16.905 టీఎంసీలు ఉంది.