భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతుంది. నిన్న భద్రాచలం సబ్ కలెక్టర్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం వరకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే సూచనలు ఉన్నాయని తాసిల్దార్ తెలిపారు. గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు.