భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షం ధాటికి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో తాలిపేరు, కిన్నెరసాని,పెద్దవాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ వద్ద మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గూడూరులోని పాఖాల వాగు బ్రిడ్జి పై నుండి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గూడూరు నుండి మండలంలోని 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.