న్యూఢిల్లీ: ప్రముఖ కైర్న్ ఇండియా, వేదాంత లిమిటెడ్ల మధ్య కుదిరిన ఒప్పంద పథకానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ అనుమతినిచ్చింది. అలాగే ఇరు సంస్థల వాటాదారులకు సంబంధించిన ఒప్పంద అంశానికి కూడా గ్రీస్ సిగ్నల్ ఇచ్చింది. కాగా కైర్న్ ఇండియా దేశంలో అతిపెద్ద స్వతంత్ర ఆయిల్, సహజవాయు వెలికితీత, ఉత్పాదక సంస్థ. గుర్గావ్ కేంద్రంగా ఈ సంస్థ కొనసాగుతోంది. వేదాంత గ్రూప్నకు చెందిన వేదాంత లిమిటెడ్ సహజ వనరుల వెలికితీత సంస్థ. కైర్న్ ఇండియా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడులలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపుఉంది. అలాగే సంస్థకు భారత్లో ఏడు బ్లాకుల్లో, దక్షిణాఫ్రికాలో ఒక బ్లాకులో కార్యకలాపాలు కొనసాగిస్తోంది.