ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ అత్యంత కీలకం: కూల్‌ప్యాడ్గ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2017, 01:09 AM

హైదరాబాద్‌: స్మార్ట్‌ఫోన్‌ తయారీ, ఇంటిగ్రేటెడ్‌ వైర్లెస్‌ డేటా సొల్యూషన్స్‌ అగ్రగామి కూల్‌ప్యాడ్‌ తన స్మార్ట్‌ఫోన్లను హైదరాబాద్‌లో ప్రదర్శించింది. తన ఫింగర్‌ ప్రింట్‌ స్మార్ట్‌ఫోన్‌ 5 తదుపరి ఎడిషన్‌ నోట్‌ 5 లైట్‌ వీటిలో ఉంది. భారతదేశంలో కంపెనీ అభివృద్ధిలో కీలకం కానున్న మూడు ప్రముఖ నగరాల్లో హైదరాబాద్‌ ఒకటని కం పెనీ ఈ సందర్భంగా పేర్కొంది. ఎల్‌ఈడీ ఫ్లాష్‌  3 జీబీ రామ్‌తో 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరాతో కూడిన నోట్‌ 5 లైట్‌ ఇటీవల ఢిల్లీలో మార్చి 21న ఆవిష్కరించింది. ఈ ఫోన్‌ వెల రూ.8,199. ఇది ఎక్స్‌క్లూజివ్‌గా అమె జాన్‌.ఇన్‌లో లభ్యమవుతుంది. ఇది గోల్డ్‌, గ్రే రంగుల్లో లభిస్తుంది. కంపెనీ తమ బెస్ట్‌ సెల్లర్‌ ఫోన్లు అయిన కూల్‌ 1 డ్యూయల్‌, నోట్‌ సిరీస్‌లో తదుపరిగా వచ్చిన నోట్‌ 5 లైట్‌ను కూడా ప్రదర్శించింది. వీటిలో కూల్‌ 1 డ్యూయల్‌ అతి తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా 2 మిలియన్‌ యూనిట్లు విక్రయించింది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com