-కుల వృత్తికి మిషనరీని 90 శాతం సబ్సిడితో అందజేయాలి
-సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు బంగారు నర్సింహ్మ సాగర్
-సగరుల సమస్యలపై స్పీకర్, ఎమ్మెల్యే ఆర్. క్రిష్ణయ్యకు వినతి
హైదరాబాద్, మేజర్న్యూస్: సగర ఉప్పర కులస్తుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు బంగారు నర్సింహ్మ సాగర్, కార్యదర్శులు శేఖర్ సాగర్లు శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ మధుసుదన్చారి, ఎమ్మెల్యే ఆర్. క్రిష్ణయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. సగరులకు ఫెడరేషన్స్ నిధులు కేటాయించాలని, ఈ విషయంపై అసెంబ్లీలో మాట్లాడాలని ఎమ్మెల్యే ఆర్. క్రిష్ణయను వారు కోరారు. సగరుల కుల వృత్తి పనులు చేసుకునేందుకు నిర్మాణ పనిలో వాడే పనిముట్లకు 90 శాతం సబ్సిడితో సగర ఫెడరేషన్స్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఇందులో బాగంగా సెల్ప్లోడింగ్ కాంక్రీట్ మిక్సింగ్ యంత్రం, స్టీల్ జాక్ సెంట్రింగ్, అటో లెవేల్ లెజర్ కాంక్రీట్ పవర్ యంత్రం, ప్రొక్లెనర్స్, జెసీబి, టాక్టర్ ట్రాలి, రులర్, మిల్లర్తో కూడిన ట్రాక్టర్, లిప్టు యంత్రం, ట్రాక్టర్తో కూడిన కంప్రెజర్, డ్రిల్లింగ్ మిషన్, లేత్ మిషన్, చిప్పింగ్ మిషన్, రాక్కట్టింగ్ మిషన్, వెల్డింగ్ మిషన్, స్టోన్ మిషన్, పెయింటింగ్ స్ప్రెమిషన్, పెయింటింగ్ జూల మిషన్, క్యూక్రషర్ యంత్రం తదితర పనిముట్లను, రోడ్డు నిర్మాణం ఉపయోగించి మిషనరీలో భాగంగా గ్రేడర్, వైబ్రెషన్ రూలర్స్, ప్లాంట్ ట్రాన్స్పోర్టు టీప్పర్స్ సిట్టింగ్ లోడర్స్, మిల్లర్ లారిలు కేటాయించాలని అదే విధంగా క్రషర్ నిర్మాణానికి ప్రభుత్వ భూమిని లీజుకు కేటాయించి దీనికి అనుమతులు ఇచ్చి నిర్మాణ పనులలో నూతన మిషనరీకి రుణ సదుపాయం కల్పించి సగరులకు జీవోపాధి కల్పించేందుకు కృషి చేయాలని అన్నారు. అంతే కాకుండా సొంత ఇండ్లులేని కుటుంబాలు 75 శాతానికి పైగా ఉన్నాయని, సగర కులాలకు సామాజిక గౌరవం దక్కాలంటే బిసి డి గ్రూపు నండి బిసి ఎ కు మార్చాలని లేదా ఎస్టీలో చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సిపార్సు చేయాలని వారు కోరారు. నిర్మాణ పనుల్లో ఇఎండి లేకుండా టెండర్లలల్లో పాల్టొనే ఆవకాశం ప్రభుత్వం కల్పించాలని, దానిలో భాగంగా 30 శాతం రిజర్వేషన్ ఉప్పర కులస్తులకు కేటాయించాలని తెలిపారు. వ్యక్తిగత సంఘాల ఫెడరేషన్ ద్వారా వ్యక్తి గత సంఘాలు నిర్మాణ రంగ యంత్రాల కోసం 90 శాతం సబ్సిడితో రూ. 10 లక్షల నుండి 5 కోట్ల వరకు రుణాలు ఇవ్వాలని, ఉప్పరులను అధికారికంగా భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించి 10 లక్షల ప్రమాద బీమ సౌకర్యం కల్పించాలని 50 సంవత్సరాలు పైబడిన సగర ఉప్పర కార్మికులకు 2 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, ఆసుపత్రి ఖర్చులు ప్రభుత్వమే బరించాలని, అదే విధంగా ప్రభుత్వ భవన నిర్మాణ సంఘం బోర్డు చైర్మెన్గా ఉప్పర కులస్తులను నియమించాలని, రాష్ట్ర రాజధానిలో సగర సంఘం భవనం కోసం స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు బంగారు నర్సింహ్మ సాగర్, కార్యదర్శులు ఉప్పరి శేఖర్ సాగర్, చంద్రమోహన్ సాగర్, శీను సాగర్లు కోరారు.