ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంది, మిర్చి రైతులపై టీఆర్‌ఎస్‌ సర్కార్‌ నిర్లక్ష్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2017, 02:09 AM

 -గిట్టుబాటు ధర లభించక రైతుల ఆందోళన 


 -క్వింటాల్‌ కందులకు 5,500, మిర్చికి 15 వేలు చెల్లించాలి 


 -రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి కొనుగోలు చేయాలి 


 -కాంగ్రెస్‌  కిసాన్‌సెల్‌  చైర్మన్‌ కోదండరెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లు 


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయిందని  కాంగ్రెస్‌  కిసాన్‌సెల్‌  చైర్మన్‌ కోదండరెడ్డి, టిపిసిసి ఉపాధ్య క్షులు మల్లు రవి ఆవేదన వ్యక్తం చేశారు.  ముఖ్యమంత్రి చెపితే వేసుకున్న మిర్చి, కంది పంటల రైతుల    పంటలకు గిట్టు బాటు ధరలు లేక  రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం  పట్టించుకోవడం లేదని మండిప డ్డారు.  మిర్చి పంటలకు గిట్టుబాటు ధరలు లేవని వరంగల్‌ మార్కెట్లో రైతులు మిర్చి పంటలను కాలబెట్టారని గుర్తు చేశారు.  అలాగే ఆలేరు మార్కెట్లో కందుల  ధరల కోసం రైతులు రెడ్డెక్కి రాస్తారోకో చేశారన్నారు.  దీన్ని బట్టే ప్రభు త్వం రైతుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి  బహిర్గతం అవుతుందని కోదండరెడ్డి, మల్లురవి చెప్పారు.  కందులకు క్వింటాల్‌కు  5 వేల 50 రూపాయలు, మిర్చి క్వింటాల్‌కు  రూ.15వేలు ఇవ్వాలని మల్లు రవి డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొనుగోలు సంస్థలు మార్క్‌ఫెడ్‌,  సిసిఐ, సివిల్‌ సప్లయ్‌, ఎఫ్‌.సి.ఐ, ట్రేడింగ్‌ కార్పోరేషన్‌ లాంటి సంస్థలచేత కొనుగోలు చేయించి మద్దతు ధరలు ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు.  మద్దతు ధరలు లభించలేదని ఇటీవలే ఏటూరు నాగారం రైతు ఆత్మహత్య చేసుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా  కంది, మిర్చి రైతుల గిట్టుబాటు ధర లభించక, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారన్నారు. రాష్ట్రంలో గోనే సంచుల కొరత ఉందని కొనుగోలు చేయకుండా నిలిపి వేస్తు న్నారని మార్కెట్లలో పంటలు ఎప్పుడు వస్తాయో, ఎంత ఉత్పత్తి అవుతుందో ఎన్ని సంచులు అవసరం ఉంటాయో ఎలాంటి మార్కెట్‌ సౌక ర్యాలు కల్పించాలో కూడా ప్రభుత్వం పట్టించు కోకపోవడం చూస్తుంటే,  రైతుల పట్ల టీఆర్‌ఎస్‌ అవలంభిస్తున్న వైఖరి స్పష్టమవుతుందన్నారు.  కేసిఆర్‌ ప్రభుత్వం మొదటి నుంచి రైతాంగం పట్ల  నిర్లక్ష్య ధోరణిలో అవలంభిస్తుందని,  ఇప్పటికైనా  ప్రభుత్వం తన వైఖరి మార్చుకుని  మిర్చి, కంది రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. లేకపోతే ఈ ప్రభుత్వం  రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com