ఏప్రిల్ 21న హైదరాబాద్ లో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్లీనరీ నిర్వహించనున్న కొంపల్లిలోని బీజీఆర్ గార్డెన్స్ ను గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, టీఎస్ ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, మైనంపల్లి హన్మంతరావు తదితరులు పరిశీలించారు. ప్లీనరీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు.