కరీంనగర్: కొత్తయాష్వాడలో పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహించారు. అందులో భాగంగా 22 బైక్లు, ఒక కారు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. పత్రాలు లేని వాహనాలను వినియోగించరాదని కాలనీవాసులకు పోలీసులు హితవు చెప్పారు. ఒకవేళ వినియోగిస్తే చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పత్రాలు లేని వాహనాలు నడిపినా, అనుమానంగా ఎవరైనా కనపడిన వెంటనే పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు.