హైదరాబాద్ :నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ర్యాలీ చేసేందుకు హై కోర్టు అనుమతి నిరాకరించడంతో నగరంలోని పలు యూనివర్శిటీల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గొడవలు జరిగేందుకు ఆస్కారం ఉన్న కళాశాలల్లో, యూనివర్సిటీల్లో ఇప్పటికే పోలీసు భద్రతా దళాలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ర్యాలీ చేసేందుకు హైకోర్టు అనుమతి నిరాకరించడంతో అందుకు నిరసనగా నిజాం కళాశాలలో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం , ర్యాలీకి చేసేందుకు విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు.