హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఉద్రికత్త నెలకొంది. నిరుద్యోగ ర్యాలీకి వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుంటున్నారు. కాగా... సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్దకు డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలతోపాటు నిరుద్యోగులు కూడా తరలివచ్చారు. అనంతరం అక్కడినుంచి ర్యాలీకి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే... ఓ యువతి తన చున్నీతో ఉరేసుకునేందుకు ప్రయత్నించింది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. కాగా... ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా పలువురు నినాదాలు చేశారు.