రాయపర్తి: వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారం సమీపంలో ఈరోజు ఉదయం రెండు లారీలు అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు లారీల డ్రైవర్లు మృతిచెందారు. మృతులను కడప జిల్లాకు చెదిన ముబారక్ సయ్యద్, నందిగామకు చెందిన సుభాన్గా గుర్తించారు. వాహనాలను అతి వేగంగా ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.