హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’ (డీజే). ఈ సినిమా జూన్ 23న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్తన ఫేస్బుక్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ పోస్టర్ను షేర్ చేశారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే కథానాయికగా నటిస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.