వరంగల్ బహిరంగ సభను విజయవంతం చేయాలని డిప్యూటీసీఎం మహమూద్ అలీ, మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి పిలుపునిచ్చారు.ఇప్పటికే సభకు తరలివచ్చేందుకు అన్ని వర్గాల నుంచి భారీ స్పందన వస్తుందుని తెలిపారు. తెలంగాణ భవన్ నుంచి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో వరంగల్ సభకు సైకిల్ యాత్ర చేపట్టారు. సైకిల్ యాత్రను డిప్యూటీసీఎం మహమూద్ అలీ, మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి పలువురు తెరాస నేతలు పాల్గొన్నారు.