హైదరాబాద్: సచివాలయంలో మిషన్ భగీరథ పనులపై ఉన్నతాధికారులతో మంత్రి మహేందర్రెడ్డి సమీక్ష నిర్వహించారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో రూ.2004 కోట్ల నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై నియోజకవర్గాల వారీగా చర్చించారు. 3525 కి.మీ. పైప్లైన్తో 15 లక్షల 35 వేల మంది ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించే పథకాన్ని సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిష్టాత్మకమైన పథకాన్ని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిషన్ భగీరథ పనుల నాణ్యతలో ప్రమాణాలు పాటించాలని తెలిపారు.