రామానుజాచార్య 1000వ జయంతి సందర్భంగా ఆయన చిత్రంతో రూపొందించిన తపాలా బిళ్ళను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశారు. తొలి తపాలా బిళ్ళను తెలంగాణ, ఏపీ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అందుకున్నారు. ఢిల్లీలోని ప్రధాని నివాసం 7 లోక కళ్యాణ్ మార్గ్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, పొన్ రాధాకృష్ణన్ తో పాటు చినజియర్ స్వామి కూడా పాల్గొన్నారు.విశిష్టాద్వైతం ద్వారా ప్రజలను కలిపేందుకు రామానుజాచార్య కృషి చేశారన్నారు ప్రధాని మోడీ. మోక్షానికి సంబంధించిన గురు మంత్రాన్ని రహస్యంగా ఉంచేవారని. కానీ సర్వజనుల హితం కోసం మోక్షానికి సంబంధించిన మంత్రాన్ని రామానుజాచార్య బహిర్గతం చేశారని కొనియాడారు.